నందిగామ, జూలై 25 : గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నాట్కో ట్రస్ట్ సహకారంతో సుమారు రూ.20లక్షలతో నిర్మిస్తున్న అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణ పనులను ఆదివారం ఎమ్మెల్యే జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ప్రతి ఒక్కరూ లబ్ధి..
రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలతో ఎదో ఒక రూపంలో లబ్ధిపొందుతున్నారని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పద్మారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శిశంకర్గౌడ్, ఎంపీటీసీలు చంద్రపాల్రెడ్డి, కోమ్ముకృష్ణ, కుమారస్వామి గౌడ్, కో ఆప్షన్ మెంబర్ బేగ్, చేగూర్ పీఏసీఎస్ చైర్మన్ అశోక్, మాజీ చైర్మన్ విఠల్, సర్పంచ్లు జెట్టకుమార్, స్వామి, ఉపసర్పంచ్ కుమార్ గౌడ్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, విద్య కమిటీ చైర్మన్ రాములు, ఎంపీడీవో బాల్రెడ్డి, సీడీపీవో నాగమణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్రెడ్డి, నాట్కో ట్రస్ట్ మేనేజన్ రాంబాబు, నాట్కో ప్రతినిధులు ప్రసాద్, నాయకులు బాల్రెడ్డి, కృష్ణయ్య, పెంటయ్యగౌడ్, వీరేందర్గౌడ్, నర్సింహ, చెన్నయ్య, శ్రీశైలం, జంగయ్య, రమేశ్, ప్రవీణ్, గోపాల్, సురేందర్రెడ్డి, లక్ష్మయ్య పాల్గొన్నారు.
శ్రీనివాసులగూడలో ప్రత్యేక పూజలు..
నందిగామ మండల పరిధిలోని శ్రీనివాసులగూడలో సర్పంచ్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.