పరిగి, జూలై 20: పేదవారి ఇంటి కల సాకా రం చేసేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టా రని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి పట్టణం సమీపంలోని తుంకులగడ్డలో 300 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను ఎమ్మె ల్యే మహేశ్రెడ్డి పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు అన్ని సదుపాయాలతో కూడిన ఇండ్ల నిర్మా ణం చేసి ఇవ్వాలన్నదే సర్కారు లక్ష్యమ న్నారు. సీసీ రోడ్లు, తాగు నీటి సరఫరా వ్యవస్థ, ఇతర సదుపాయాలు పూర్తిస్థాయి లో కల్పించిన తర్వాత లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వనున్నట్టు తెలిపారు. లబ్ధిదారులు ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా, సర్కారు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదని, నేరుగా గృహ ప్రవేశం చేసే విధంగా పనులు పూర్తి చేయ నున్నట్టు తెలిపారు.
పరిగి నియోజకవర్గంలో ప్రస్తుతం పరిగిలో 300, మహ్మ దాబాద్లో 100, గండీడ్లో 100, కులకచర్లలో 80, దోమ లో 50, పూడూరులో 50 మొత్తం 680 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, త్వరలోనే మరో 2వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభం కానుందని ఎమ్మెల్యే తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఇండ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత మెయిన్ రోడ్డు నుంచి అక్కడకు రోడ్డు నిర్మాణం సైతం చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుం ద అశోక్, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీ ణ్కుమార్రెడ్డి, ఎ.గోపాల్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, కౌన్సిలర్లు వేముల కిరణ్, వారాల రవీంద్ర, ఎదిరె క్రిష్ణ, వెంకటేశ్, నాయకులు బి.రవికుమార్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు