మర్పల్లి, జూలై 30: ప్రతిఒక్కరూ పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కల్ఖోడా, దామస్తాపూర్ గ్రామాలను సందర్శించి, పల్లె ప్రగతి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లోని వైకుంఠధామాల నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తిచేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. దామస్తాపూర్లో పారిశుధ్యం పనులు పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని, తడి, పొడి చెత్తను ఇంటివద్దనే వేరుచేసి ట్రాక్టర్ వచ్చినప్పుడు వేయాలని గ్రామస్తులకు సూచించారు. బియ్యం తీసుకున్నారా, మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటి రక్షించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జైపాల్రెడ్డి, ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్, వైస్ ఎంపీపీ మోహన్రెడ్డి, బట్టు రమేశ్, ఎంపీవో సోమలింగం, ఏపీవో అంజిరెడ్డి, ఈసీ విఠల్, ఏఈ శ్రావణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి శ్రీశైలం పాల్గొన్నారు.
కోట్పల్లిలో..
కోట్పల్లి, జూలై 30: గ్రామాల్లో కొనసాగుతున్న పల్లె ప్రకృతి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య ఆదేశించారు. బార్వాద్ గ్రామంలో వైకుంఠధామం పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెల్లో అన్ని వసతులను కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హాల్స్, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు ఏర్పాటు చేస్తున్నదన్నారు. ఇది వరకే అన్ని పంచాయతీల్లో వీటి నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. బార్వాద్ గ్రామంలో మాత్రం క్రిమిటోరియం ఆలస్యమైందని, గ్రామస్తుల సహకారంతో స్థానిక సర్పంచ్ క్రిమిటోరియం పనులను చకచకా చేపడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మండల సర్పంచుల మండల సంఘం అధ్యక్షుడు, బార్వాద్ సర్పంచ్ ధర్మపురం వెంకటేశ్యాదవ్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, ఎంపీవో డానియల్, పంచాయతీ కార్యదర్శి మైనోద్దిన్ పాల్గొన్నారు.