షాబాద్, సెప్టెంబర్ 21 : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం జడ్పీటీసీ అవినాశ్రెడ్డితో కలిసి మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్టీ మండల కమిటీని ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్ష, కార్యదర్శులుగా గూడూర్ నర్సింగ్రావు, చల్లా శ్రీరాంరెడ్డిని నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ…ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు రూ. 2లక్షల ప్రమాదబీమా సదుపాయం కల్పించి అండగా నిలిచిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం.. సీఎంపై.. ఆరోపణలు చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. గ్రామాల్లో నూతనంగా ఎన్నుకున్న కమిటీ సభ్యులు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జడ్పీటీసీ అవినాశ్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, పీఏసీఏస్ చైర్మన్ శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు ప్రభాకర్రెడ్డి, మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు చాంద్పాషా, సీనియర్ నాయకులు వెంకటయ్య, ఈదుల నర్సింహులుగౌడ్, చేగూరి యాదయ్య, కల్వకోల్ వెంకట్యాదవ్, జడల రాజేందర్గౌడ్, పోన్న నర్సింహారెడ్డి, జీవన్రెడ్డి, కరుణాకర్, మండల నాయకులు తొంట వెంకటయ్య, సతీశ్రెడ్డి, కారు చెన్నయ్య, ముఖ్రం, ఇమ్రాన్, ఇబ్రహీం, ఇనాయత్, మునీర్, రాజుగౌడ్ పాల్గొన్నారు.
పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకం
టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకమని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యాదయ్య ఆధ్వర్యంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ అధ్యక్షుడిగా రెండో సారి పెద్దోళ్ల ప్రభాకర్ను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా రామగౌడ్, ఇంద్రాసేన రెడ్డి, చందు, ప్రధాన కార్యదర్శిగా హన్మంత్రెడ్డి, కార్యదర్శులుగా వెంకటేశ్, శ్రీనివాస్ గౌడ్, ముకుందంగౌడ్, ఎల్లయ్య, రాములు, మండల బీసీసెల్ అధ్యక్షుడు రాములు, ఎస్సీసెల్ అధ్యక్షుడిగా గండు రవీందర్, మైనార్టీ అధ్యక్షుడిగా అబ్ధుల్ గని, మహిళ అధ్యక్షురాలిగా రాలుగా మిట్ట లత, యువజన అధ్యక్షులుగా తోట చంద్రశేఖర్, టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా వంశీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతన మండల కమిటీ అధ్యక్షులు పని చేయాలని తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా కార్యకర్తలు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షుడు ప్రభాకర్ను ఎమ్మెల్యే యాదయ్య, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు వనం లక్ష్మీకాంత్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి పూలు, శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్లు నర్సింహులు, మాణిక్యరెడ్డి, నాయకులు భూపతి రెడ్డి, శివారెడ్డి, రవీందర్, యాదిరెడ్డి పాల్గొన్నారు.
ముడిమ్యాల గ్రామాధ్యక్షుడిగా నిరంజన్ యాదవ్
ముడిమ్యాల టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడిగా బూర్ల నిరంజన్ యాదవ్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ గ్రామ కమిటీలను పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రభాకర్, మర్కెట్ కమిటీ చైర్పర్సన్ శివనీలచింటూ, సీనియర్ నాయకులు రమణారెడ్డి, దేవర కృష్ణారెడ్డి, పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, ముడిమ్యాల పీఏసీఎస్ చైర్మన్ రాములు, రావులపల్లి సర్పంచ్ కేసారం శ్రీనివాస్, ఆలూర్ ఉప సర్పంచ్ వెంకటేశ్ యాదవ్ పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, జడ్పీటీసీ అవినాశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పెద్ద వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కల్వకోల్ వెంకట్యాదవ్, టీఆర్ఎస్ నాయకులు రాజేందర్గౌడ్, శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.