షాద్నగర్, జూలై14: పల్లెలు ప్రగతి వైపు పయనిస్తున్నాయి. తెలంగాణ సర్కారు వెచ్చిస్తున్న నిధుల ఫలితం గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. నాడు ఆదరణకు నోచుకోని పల్లెలు నేడు పచ్చదనం, ప్రగతి ఫలాలతో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెవాసుల్లో సంతోషాన్ని నింపుతున్నది. గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరగడంతో అన్ని వర్గాల ప్రజలు మొక్కలు పెంచే దిశగా పయనిస్తూ, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. పాడుబడిన బావులు, గుంతలు, మురికి తుమ్మచెట్ల తొలగింపు, మురుగు కాల్వల పూడికతీత, వీధుల సుందరీకరణ, ప్రజలు సేద తీరేందుకు ప్రకృతి వనాలు, కమ్యూనిటీ భవనాలు, ఇంటింటికీ మంచి నీటి నల్లాల బిగింపు, 24 గంటల విద్యుత్ సౌకర్యం, నిత్యం చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ, వన నర్సరీలు వంటి అభివృద్ధి పనులు పల్లె ప్రగతితో సాధ్యమయ్యాయి.
ఆదర్శంగా పల్లె ప్రగతి పనులు
జిల్లెడు చౌదరిగూడ మండలంలోని చేగిరెడ్డి ఘణాపూర్ గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి పనితీరు ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గ్రామంలో 1289 మంది జనాభా, 400 నివాసాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో శుభ్రతతో పాటు పచ్చదనం నెలకొన్నది. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నది. గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇప్పటికి రూ.కోటికి పైగా నిధులు వెచ్చించారు. రూ.18.50 లక్షలతో విద్యుత్ సమస్యను పరిష్కరించారు. 4 వేల మొక్కలతో ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేశారు. రూ.29.36 లక్షలతో చెత్త సేకరణ, చెట్లకు నీళ్లు పోసేందుకు ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. రూ.20 లక్షలతో సీసీ రోడ్లు, రూ.3 లక్షలతో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం, రూ.1.70 లక్షలతో చెత్త డంపింగ్ యార్డు, రూ.12 లక్షలతో వైకుంఠధామం నిర్మిస్తున్నారు. రూ.2 లక్షలు వెచ్చించి బోరు మోటార్లను కొనుగోలు చేశారు. ఇందులో భాగంగానే అదనంగా ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇప్పటికే 4,500 మొక్కలు నాటి, సంరక్షిస్తున్నారు. రూ.3 లక్షలతో ప్రకృతి వనాన్ని ఏర్పాటుచేశారు. ఈజీఎస్ పథకం ద్వారా గ్రామంలో వన నర్సరీలో మొక్కలు పెంచుతున్నారు.
పల్లె ప్రగతితో అభివృద్ధి
గ్రామాభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం బా గుంది. ఈ కార్యక్రమం తో ప్రణాళిక ప్రకారం అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నిత్యం గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణ చేస్తు న్నాం. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం వంటి పనులు చేశాం. పల్లె ప్రగతితో ఊరు పరిశుభ్రంగా ఉంటున్నది.
– శివమౌళి, సర్పంచ్, చేగిరెడ్డి ఘణాపూర్,జిల్లెడ్ చౌదరిగూడ మండలం
గ్రామం శుభ్రంగా మారింది
పల్లెప్రగతి కార్యక్రమానికి ముందు మా ఊళ్లో ఎక్కడపడితే అక్క డ చెత్తాచెదారం వేసేటోళ్లు. పరి శుభ్రతపై ప్రజలకు అవ గాహన కల్పించారు. దీం తో ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి రోజూ ఉదయం పంచాయతీ బండితో చెత్తను తీసుకుపోతున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు వేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో వీధులన్నీ పచ్చగా కనిపిస్తున్నాయి.