షాద్నగర్రూరల్, సెప్టంబర్27: కరోనాను పూర్తిగా అంతమొందించేందుకు అందరూ కొవిడ్ నియంత్రణ వ్యాక్సిన్ తీసుకోవాలని డిప్యూటీ డీఎమ్హెచ్వో దామోదర్ తెలిపారు. 100 శాతం వ్యాక్సినేషన్ ప్రకియ పూర్తయ్యేలా చూడాలన్నారు. మొదటగా వ్యాక్సిన్ కేంద్రాలు 72 ఏర్పా టు చేశామన్నారు. అందుబాటులోని కేంద్రాల్లో వ్యాక్సిన్పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫరూఖ్నగర్ మండలంలోని వివిధ గ్రామల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ వ్యాక్సిన్ను తప్పకుండా ప్రతిఒక్కరూ రెండు డోసులు తీసుకోవాలని సూచించారు.
కొండకల్లో వంద శాతం వ్యాక్సినేషన్: ఎంపీడీవో
మండలంలోని కొండకల్ గ్రామంలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని ఎంపీడీవో సత్యయ్య తెలిపారు. సోమవారం కొండకల్ గ్రామానికి వెళ్లి ఆయన వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 2700 జనాభా ఉందని, అందులో 18 ఏండ్లపైబడిన వారు 1700 ఉన్నారని అన్నారు. వారందరికీ టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య కాశీనాథ్గౌడ్, ఎంపీటీసీ బద్ధం సరేందర్రెడ్డి, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది, పాల్గొన్నారు.
తప్పనిసరిగా టీకాలు వేసుకోవాలి
తప్పనిసరిగా ప్రతిఒక్కరూ కొవిడ్ టీకాలు వేసుకోవాలని దామరిగిద్ద సర్పంచ్ వెంకటేశం గుప్తా తెలిపారు. సోమవారం మండలంలోని దామరిగిద్ద గ్రామస్తులకు కొవిడ్ టీకాలు వేశారు. టీకాలతోనే కరోనాకు అడ్డుకట్టవేయవచ్చని సర్పంచ్ అన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఏఎన్ఎం, ఆశావర్కర్లు, అంగన్వాడీ టీచర్, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.
చెన్నారంలో వాక్సినేషన్ సెంటర్ ప్రారంభం
మండలంలోని చెన్నారం గ్రామంలో ప్రత్యేక వాక్సినేషన్ సెంటర్ను సర్పంచ్ స్వప్న ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మొదటిరోజు 100 మందికి వాక్సిన్ వేసినట్లు తెలిపారు. గ్రామంలో 100శాతం వాక్సినేషన్ పూర్తయ్యేలా అవగాహన కల్పించామన్నారు. మండలంలో 6 ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేసి టీకా పంపిణీ చేపట్టినట్లు వైద్యులు శారద, అజీం, ప్రభాకర్ తెలిపారు. ప్రతిఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరలక్ష్మి, వార్డు సభ్యురాలు భాగ్యలక్ష్మి, ఏఎన్ఎం రాజేశ్వరి, స్థానిక వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.