కందుకూరు, ఆగస్టు 5 : నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాల కల్పనకోసం ప్రభుత్వం నిర్వహిస్తున్నజాబ్మేళను సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా డీఆర్డీఎ అధికారి ప్రభాకర్ కోరారు.గురువారం మండల పరిషత్ సమావేశపు హాలులో సీసీలు, వీఏఓలు, ఇజీఎస్, ఐసీడీఎస్ సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 9న మండల కేంద్రంలో ప్రభుత్వం జాబ్ మేళను నిర్వహిస్తుందని తెలిపారు. 5వ తరగతి మొదలు పోస్టు గ్రాడ్యువేషన్ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులకు దీన్ని సద్వీనియోగం చేసుకోవాలని కోరారు. 18 నుంచి 35లోపు వయస్సు ఉన్న అన్ని కులాలకు చెందిన యువతీ యువకులు దీనికి అర్వూలని తెలిపారు. ఏదైన శిక్షణ పొందిన సర్ధిఫికెట్లు, గుర్తింపు కార్డు, పోటోలు తీసుకొని జాబ్ మేళకు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీడీఓ క్రిష్ణకుమారి, ఈఓఆర్డి విజయలక్ష్మీ, హమ్మద్, వైఎస్ ఎంపీపీ శమంత ప్రభాకర్రెడ్డిలు పాల్గొన్నారు.