ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్కలాం ప్రపంచం గర్వించదగ్గ గొప్ప మేధావని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, జస్టిస్ చంద్రయ్య అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం సమీపంలోని గోపాల గోశాలలో ఏపీజే అబ్దుల్కలాం వర్ధంతిని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ రాజేందర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీజే అబ్దుల్కలాం దేశానికి మిసైల్ అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ప్రఖ్యాత వైద్య నిపుణుడు రాంచందర్, గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్, ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు గోనారెడ్డి, ఐఆర్ఎస్ అధికారి ఆనంద్, డీఆర్డీవో శాస్త్రవేత్త సుధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.
కలాం అడుగుజాడల్లో నడవాలి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో అబ్దుల్ కలాం వర్ధంతిని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా అబ్దుల్కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. కార్యక్రమంలో కొండ్రిగానిబోడు తండా సర్పంచ్ సేవ్యాబావోజీ, కోఆప్షన్ మండల సభ్యుడు జహంగీర్బాబా, నాయకులు భిక్షపతి, వెంకటయ్యగౌడ్, లాయక్అలీ పాల్గొన్నారు.
కేశంపేటలో..
కేశంపేట, జూలై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలను కొనియాడారు.