ధారూరు, జూలై 16 : రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించాలని తెలంగాణ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శుక్రవారం ధారూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ధారూరు పీఏసీఎస్ కార్యాలయ సిబ్బంది చైర్మన్, వైస్ చైర్మన్ పాలకవర్గ సిబ్బంది ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి మాట్లాడుతూ ధారూరు పీఏసీఎస్ పరిధిలో మక్కజొన్న కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఎరువులతో పాటు మక్కజొన్నలను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. మండల పరిధిలోని నాగారం, ధారూరు, కేరెళ్లి గ్రామాల్లో పీఏసీఎస్ ధారూరు ఆధ్వర్యంలో ఎరువులను అందుబాటులో ఉంచేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట ధారూరు పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, పాలకవర్గ సభ్యులు సుధాకర్గౌడ్, గోపాల్రెడ్డి, శివకుమార్, తులసీరామ్, సీఈవో నర్సింహులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.