వికారాబాద్, జూలై 27 : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం లబ్ధిదా రులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మంగళ వారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేటలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల అందజేశారు. ఆమెతో పాటు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్కుమార్, వికారాబాద్ పట్టణ ఉపా ధ్యక్షుడు కడియాల వేణుగోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి డి.దత్తు, శివారెడ్డిపేట గ్రామ అధ్యక్షులు ఖాదర్వలీ, రషీద్, నజీర్, నర్సింహులు, ముజూహిద్, మైనార్టీ నాయకుడు షరీఫ్, రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.
మోమిన్పేట,జూలై 27: పేదల ఆకలి తీర్చడానికే రాష్ట్ర ప్రభు త్వం కొత్త రేషన్ కార్డులను అందజేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు.మండల వారం మండల కేం ద్రంలోని సూపర్ డీలక్స్ ఫంక్షన్హాల్లో ఎంపీపీ వసంత వెం కట్తో కలసి వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో సివిల్ సైప్లె అధికారి పద్మ, పీఏసీఎస్ చైర్మన్లు అంజిరెడ్డి,విష్ణువర్దన్ రెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు విఠల్,డీటీ రవిందర్ దత్తు పాల్గొన్నారు.
కోట్పల్లి, జూలై 27: అర్హులందరికీ రేషన్కార్డులను ప్రభు త్వం జారీ చేసిందని మండల పార్టీ అధ్యక్షులు అనిల్కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని రాంపూర్ గ్రామంలో రైతువేదికలో 12 పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 152 మంది అర్హులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స ర్పంచ్ అనితా గో పాల్రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు సత్యం, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, తాసీల్దారు రసూల్, ఆర్ఐ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బంట్వారం, జులై 27 : ప్రతి పేదవాడికి ప్రభుత్వం భరోసా ఇస్తున్నదని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గంచెర్వు మల్లేశం పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలొ 159 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్ర మం లో ఎంపీపీ ప్రభాకర్, జడ్పీటీసీ సంతోష, తాసీల్దార్ ఎంఏ అజీజ్, డీటీ నాగార్జునరెడ్డి, సర్పంచ్లు నర్సింహారెడ్డి, నర్సిం హులు, ఎంపీటీసీ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.