ఇబ్రహీంపట్నం, జూలై 23 : ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి కోసం రూ. 2 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేస్తు న్నట్లు ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి, కమి షనర్ జగత్విక్యాత్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పాలకవర్గం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశా రు. సమావేశంలో పలు అంశాలపై తీర్మానాలు చేశారు. మున్సి పాలిటీ పరిధిలోని 24 వార్డులలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఈ నిధులను ఖర్చు చేయాలని తీర్మానించారు. ఈ నిధులను 14వ ఆర్థిక సంఘం కింద రూ. 60లక్షలు, 15వ ఆర్థిక సంఘం కింద రూ. 70లక్షలు, మిగతా నిధులను మున్సిపల్ కోటా కింద కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ నిధులతో అన్ని వార్డులలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్చైర్మన్ యాదగిరి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.