కేశంపేట, జూలై 27 : పేదల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మండలంలోని ఎక్లాస్ఖాన్పేటలోని బీఎస్ఆర్ గార్డెన్లో మంగళవారం ఎమ్మెల్యే కొత్త రేషన్కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అర్హులందరికీ కొత్త రేషన్కార్డులను మంజూరు చేసిందన్నారు. వచ్చే నెల నుంచి రేషన్ సరుకులను అందజేసేందుకు ఏర్పాటు చేసిందన్నారు. రానున్న రోజుల్లో షాద్నగర్ ప్రాంతంలో పాలమూరు ఎత్తిపోతలతో ప్రతి ఎకరాకు సాగునీరు అందజేస్తామని, రైతులు ఎవరూ తమ భూములను అమ్ముకోవద్దని సూచించారు. పేదల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ తనతో పాటు అధికారులు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఈట గణేశ్, ఎంపీపీ రవీందర్యాదవ్, జడ్పీటీసీ తాండ్ర విశాల, ఆర్డీవో రాజేశ్వరి, తాసిల్దార్ మురళీకృష్ణ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు రాంబల్నాయక్, వైస్ ఎంపీపీ అనురాధ, మండల కోప్షన్ మెంబర్ జమాల్ఖాన్, మాజీ జడ్పీటీసీ నర్సింగ్రావు, టీఆర్ఎస్ నాయకుడు మురళీధర్రెడ్డి, సర్పంచ్, ఎంపీటీసీలు, రెవెన్యూ సిబ్బంది, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
ఫరూఖ్నగర్ మండలంలో..
అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డును అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలోని ఫరూఖ్నగర్ మండల పరిషత్ సమావేశ మందిరంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేసి మాట్లాడారు. షాద్నగర్ నియోజకవర్గంలో నూతనంగా 1, 769 మంది లబ్ధిదారుల కుటుంబాలకు రేషన్ కార్డులను అందజేయడం సంతోషకరమని చెప్పారు. ఇప్పటికే షాద్నగర్ నియోజకవర్గంలో 70 వేల మంది రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులను పొందుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్, మున్సిపల్ చైర్మన్ కె. నరేందర్, వైస్ చైర్మన్ నటరాజన్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ పి. వెంకట్రాంరెడ్డి, కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్, ఆర్డీవో రాజేశ్వరి, తాసిల్దార్ పాండు, ఎంపీడీవో మధుసూదన్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బక్కన్న, కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్, ప్రతాప్రెడ్డి, బచ్చలి నర్సింహ, కానుగు అంతయ్య, టీఆర్ఎస్ నాయకులు చెట్ల నర్సింహ, లక్ష్మణ్నాయక్, మన్నె నారాయణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రభుత్వ అధికారులు, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు.