కులకచర్ల, జూలై 16: కల్యాణలక్ష్మి పేదలకు వరంలా ఉపయో గపడు తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం చౌడాపూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గతంలో ఆడపిల్లల పెండ్లిళ్లు చేయా లంటే తల్లిదండ్రులు ఇబ్బందులు పడేవారని, సీఎం కేసీఆర్ కల్యా ణలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన తరువాత చాలా సంతోషంతో వివాహాలు చేస్తున్నారన్నారు. ప్రభు త్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వీటిని ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులకు ఉందని వివరించారు. ప్రజలు కూడా ప్రభుత్వ పథకాలను సద్వి నియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రాందాస్నాయక్, ఎంపీటీసీ శంకర్, మరికల్ సర్పంచ్ పాండురంగయ్య, తాసీల్దార్ అశోక్కు మార్, కులకచర్ల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.