తుర్కయాంజాల్, జూలై 19: ప్రభుత్వ అందజేసిన వరద సహా యాన్ని బాధితులకు అందజేయకుండా దుర్వినియోగం చేసిన వారి పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ తుర్కయాంజాల్ మున్సిపాలిటీ ఉమర్ఖాన్ గూడ వరద బాధి తులు కౌన్సిలర్ కరాడి శ్రీలతఅనిల్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధరాంరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ బాధి తులకు న్యాయం జరి గేలా చూస్తానని ఆమె హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరితధన్రాజ్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్స్ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగ మ్మశివకుమార్, కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కొశిక ఐలయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా మున్సి పాలిటీని అభివృద్ధి చేసుకుందామని చైర్ పర్సన్ మల్రెడ్డి అనురాధ అన్నారు. సోమ వారం తుర్క యాంజాల్ మున్సిపల్ కార్యా లయంలో వైస్ చైర్ పర్సన్ గుండ్లపల్లి హరితధన్రాజ్ గౌడ్, కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పోరాటం టీఆర్ఎస్ కౌన్సిలర్ల పై కాదని అభివృద్ధికి సహ కరించని కమిషనర్ మీదనేనన్నారు.