ఆర్కేపురం, ఆగస్టు 5 : దివ్యాంగులు ఆత్మసైర్ధ్యంతో జీవితంలో జీవించాలని ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ నాగమల్లు పేర్కొన్నారు. గురువారం ఎల్బీనగర్లోని అమ్మ చేయూత ఫౌండేషన్లో 30 మంది దివ్యాంగులకు లింగాల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో దుప్పట్లు, టవల్స్, చాపలు, బకెట్లు, జగ్గులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేటి సమాజంలో దివ్యాంగులు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారని తెలిపారు. దివ్యాంగులకు సహకారం అందించేందుకు లింగాల శ్రీనివాస్ గౌడ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ సభ్యులు గుడుకుంట్ల మహేష్గుప్త, జి.రాం ప్రసాద్, కెంబా జయప్రకాష్ తదితరులు ఉన్నారు.