కడ్తాల్, జూలై 25 : మండల పరిధిలోని గోవిందాయిపల్లి, నాగిరెడ్డిగూడ, రేఖ్యా తండాల్లో ఆదివారం బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. గిరిజనుల ఆరాధ్యదైవం ముత్యాలమ్మ ఆలయంలో ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం తండాల్లోని ప్రధాన వీధులగుండా అమ్మవారి విగ్రహంతో పాటు మహిళలు, యువతులు బోనాలను ఊరేగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. గోవిందాయిపల్లి తండాలో నిర్వహించిన బోనాల పండుగకు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ హాజరై ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడారు. బోనాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలకు ప్రతీకలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను, ప్రజాప్రతినిధులను తండా నాయకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, నర్సింహ, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, రాములునాయక్, హరిచంద్నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, శ్రీనివాస్రెడ్డి, గోపాల్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరయ్య, ఉప సర్పంచ్లు శిరీష, జగన్నాయక్ పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కిషన్రెడ్డి
మండల కేంద్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బోనాల సందర్భంగా ప్రజలు ఉదయం నుంచే అమ్మవారికి బోనాలు సమర్పించారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మాట్లాడారు. అమ్మవారి కృపతో నియోజకవర్గంలోని ప్రజలు సిరిసంపదలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యాదగిరి, టీఆర్ఎస్ నాయకులు జెర్కోని రాజు, మడుపు శివసాయి, ముత్యాల చిన్న, కరుణాకర్ పాల్గొన్నారు.
పెద్దుర్తండాలో ఘనంగా బోనాలు
మండల పరిధిలోని పెద్దూర్తండా పంచాయతీలో గిరిజనులు బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా సర్పంచ్ సక్రి కిషన్నాయక్ ఆధ్వర్యంలో ముత్యాలమ్మ, సేవాలాల్మహారాజ్ ఆలయల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గిరిజన దేవతలు ముత్యాలమ్మ, భవానీమాత అమ్మవార్లకు ప్రసాదాలు సమర్పించారు. ప్రతి ఏడాది గిరిజనుల సంప్రదాయం ప్రకారం బోనాల చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రఘు, సోమ్లనాయక్, కిషన్నాయక్, రమేశ్, తార్యనాయక్, పుల్యానాయక్, శాంతి పాల్గొన్నారు.