వికారాబాద్, జూలై 23, (నమస్తే తెలంగాణ): నాడు ఉద్యమంలోనైనా.. నేడు పాలనలోనైనా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక మార్కు ఉంటుందని రాష్ట్ర విద్య, మౌలిక వసతుల కల్పన కార్పొరేషన్ చైర్మన్ జీ.నాగేందర్గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వికారాబాద్ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారన్నారు. నాడు ఉద్యమ సమయంలో వికారాబాద్ నుంచి మేడ్చల్ గండి మైసమ్మ వరకు పాదయాత్ర చేసిన విషయం గుర్తు చేశారు. వికారాబాద్, నవాబ్పేట్, శంకర్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మీదుగా గండిమైసమ్మ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టానున్నట్లు ఆనాడే చెప్పారన్నారు. నాటి ఉద్యమ నాయకుడి నుంచి నేటి ప్రభుత్వంలో మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు తీసుకుపోతున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా నేడు ముక్కోటి వృక్షార్చన చేపట్టనున్నట్లు చెప్పారు.కోటి మంది మూడు మొక్కలు నాటితే గంటలో మూడు కోట్ల మొక్కలు నాట్టేందుకు అవకాశం ఉందన్నారు. వికారాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తామని చెప్పి విధంగానే ఏర్పాటు చేశారని, త్వరలో కలెక్టరేట్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. సకల హంగులతో సర్వంగ సుందరంగా తయారు చేశారని గుర్తు చేశారు.