బొంరాస్పేట, జూలై 22:కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలోని బొం రాస్పేట మండలంలో ఉన్న దుద్యాలను, నారాయణపేట జిల్లాలోని కోస్గి మండలంలో ఉన్న గుండుమాల్, మద్దూరు మండలంలో ఉన్న కొత్తపల్లిని కొత్త మండలాలుగా ఏర్పాటు చేయనున్నారు. కొత్త మండలాల ఏర్పాటుకు కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఇచ్చిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఈ మేరకు డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ చేయాలని రెవిన్యూ ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్రావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త మం డలాల ఏర్పాటుతో కొడంగల్ నియోజకవర్గంలో మండలాల సంఖ్య ఎనిమిదికి చేరుకోనుండగా, వికారాబాద్ జిల్లాలో మండలాల సంఖ్య 20కి చేరుతుంది. పరిపాలనా సౌల భ్యం కోసం ప్రభుత్వం 2016 సంవత్సరం అక్టోబరులో కొత్త జిల్లా లు, మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడే నియోజకవర్గంలోని దుద్యాల, కొత్తపల్లి, గుండు మాల్ గ్రామాలను కూడా మండలాలుగా చేయాలని ప్రజలు ఆందోళనలు చేశారు. కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. ఆయ న హామీ మేరకు నేడు కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు కాబోతున్నాయి. ప్రభుత్వ నిర్ణ యంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
కొత్త మం డలం ఏర్పాటుతో తమ చిరకాల వాంఛ నెరవేరుతుందని దుద్యాల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గతంలో బొంరాస్పేట మం డలంలోనే ఉండి జిల్లాల విభజన సమయంలో కోస్గి మండ లంలోకి వెళ్లిన హకీంపేట, పోలేపల్లి గ్రామాలు కూడా వికారా బాద్ జిల్లాలోకి వస్తున్నాయి. ఈ రెండు గ్రామాలను బొం రాస్పేట మండలంలో కల పాలని గతంలో ఎంతో ఆందోళన చేశారు. బొంరాస్పేట మం డలంలో తిరిగి కలుపుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మళ్లీ నాలుగేళ్లకు రెండు గ్రామాలు జిల్లాలో కలువనున్నాయి. కొత్త గా ఏర్పడే దుద్యాల మండ లాన్ని వికారాబాద్ జిల్లాలోనే కొన సాగించాలని యువకులు, నిరుద్యోగులు రెండు రోజుల కింద ట ఎమ్మెల్యేను కోరగా వారి ఆకాంక్షల మేరకు నిర్ణయం వెలువడింది.
12 గ్రామాలతో దుద్యాల మండలం
12 గ్రామాలతో దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో బొంరాస్పేట మండలంలోని దుద్యాల, లగచెర్ల, ఈర్ల పల్లి, గౌరారం, చిల్ముల్మైలారం, మాచన్పల్లి, నాస్కంపల్లి, హంసాన్పల్లి, దౌల్తాబాద్ మండలంలోని కుదురుమల్ల, కొడంగల్ మండలంలోని ఆలేడు, నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని హకీంపేట, పోలేపల్లి గ్రామాలు ఉన్నాయి. వీటిలో పోలేపల్లి, హకీంపేట గ్రామాలు కొత్త జిల్లాలు ఏర్పడక ముందు బొంరాస్పేట మండలంలోనే ఉండేవి. తర్వాత ఆ రెండు గ్రామాలు కోస్గి మండలంలోకి వెళ్లాయి. మళ్లీ ఇవి ఇప్పుడు దుద్యాల మం డలంలోకి చేరుతున్నాయి. ఇకపోతే ఆలేడు, కుదురుమళ్ల గ్రామాలు దుద్యాల గ్రామానికి దగ్గరగా ఉంటాయి. కొత్తగా ఏర్పాటు చేయబోయే దుద్యాల మండలం లో తమ గ్రామా లను కలిపాలని రెండు గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేను కోరారు. వారి కోరిక మేరకు వీటిని దుద్యా లలో కలుపుతున్నారు. కొత్త గా ఏర్పాటయ్యే దుద్యాల మండ లాన్ని తాండూరు డివి జన్లో కలుపనున్నారు.
ఎనిమిది గ్రామాలతో గుండుమాల్ మండలం
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ఉన్న గుండుమాల్ను ఎనిమిది గ్రామాలతో కలిపి కొత్త మండలంగా ఏర్పాటు చేస్తు న్నారు. గుండుమాల్, సారంగరావుపల్లి, భోగారం, భక్తిమళ్ల, బలభద్రాయపల్లి, అప్పాయిపల్లి, అమ్లికుంట, ముదిరెడ్డిపల్లి గ్రామాలు ఇందులో ఉన్నాయి.
13 గ్రామాలతో కొత్తపల్లి మండలం
నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలంలో ఉన్న 13 గ్రామాలతో కొత్తపల్లిని నూతన మండలంగా ఏర్పాటు చేస్తు న్నారు. కొత్తపల్లి, కొమ్మూరు, వీరారం, నిడ్జింత, భూనీడు, దుప్పటిగట్, గోకుల్నగర్, తిమ్మారెడ్డిపల్లి, పెద్దాపూర్, మన్నా పూర్, లింగాల్చేడ్, నందిగామ, అల్లీపూర్ గ్రామాలతో కొత్త పల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తున్నారు.