పెద్దేముల్, జూలై 27: వర్షాలు సమృద్ధిగా కురిసి ఊరువాడ సల్లంగా ఉం డేలా సూడు తల్లి అంటూ గొట్లపల్లి గ్రామస్తులు గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. నైవేద్యాలను సమర్పించి మొక్కులు చెల్లించుకు న్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ పోచమ్మ తల్లి అనుగ్రహంతో వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ఊరు వాడ సల్లంగా ఉండాలని మొక్కులు చెల్లించామని తెలిపారు.
దౌల్తాబాద్ మండలంలో..
దౌల్తాబాద్ జూలై 27: మండలంలోని దేవరఫస్లవాద్ గ్రామంలో పోచమ్మ, ఊరడమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. శివసత్తుల పూనకాలు, డప్పుల దరువులతో బోనాలెత్తుకొని ఊరేగింపుగా వెళ్లారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వ హించిన అనంతరం తొలి బొనం సమ ర్పించి నైవేద్యం సమర్పించారు. వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు మల్లీశ్వరి, ఉపసర్పంచు మణిమాల పాల్గొన్నారు.
కొడంగల్లో…
కొడంగల్, జూలై 27: ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు భక్తులు ఘనంగా బోనాల నైవేద్యాలను సమర్పించుకొంటున్నారు. మంగళవారం మున్సిపల్ పరధిలోని సన్సిటీ కాలనీలో వెలసిన గాలిపోచమ్మ దేవతకు చల్లంగా చూ డాలని బోనాల ఊరేగింపుతో భక్తి శ్రద్ధలతో బోనం నైవేద్యాన్ని సమర్పిం చుకొన్నారు. అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించుకొని బోనం నైవేద్యాన్ని సమర్పించి పిల్లా పాపల్ని చల్లంగా చూడా లని, కరోనా మహమ్మారిని అంతం చేయాలని మొక్కులు చెల్లించుకున్నారు.
బషీరాబాద్మండల కేంద్రంలో..
మండల కేంద్రంలో పోచమ్మ, మైసమ్మలకు మం గళవారం బోనాలను సమర్పించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం, బోనాలను సమ ర్పించి అమ్మవారికి మొక్కుకున్నారు. కార్యక్ర మంలో బుడగ జంగం పెద్ద లు కడమంచి తిరుపతి, కడమంచి వీరేశం, వారణాసి రమేశ్, వారణాసి అశోక్, రుద్రాక్షల రావణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.