రాజన్నసిరిసిల్ల : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు పడింది. రికార్డ్ అసిస్టెంట్ వెంకటేశ్ను సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
దేవస్థానం డబ్బుల విషయంలో అవకతవలకు పాల్పడినందున వెంకటేశ్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రూ.44.99 లక్షలను వెంకటేశ్ తన సొంత అవసరాల కోసం వాడుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో విచారణ జరిపిన ఈఓ.. వెంకటేశ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.