రాజన్న సిరిసిల్ల : ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్యపు కథనాలు రాసిన వెలుగు పత్రికను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ యూత్ నేతల నిరసన చేపట్టారు. మంగళవారం అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా సీఎంపై తప్పుడు రాతలు రాస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికైనా ఆ పత్రిక తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.