రాజన్న సిరిసిల్ల : అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. నిషేధిత గుట్కాను తరలిస్తున్నారనే విశ్వసయనీయ సమాచారం మేరకు..టాస్క్ఫోర్స్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్యర్యంలో తంగళ్లపల్లి మండల కేంద్రంలో తనిఖీలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన పీసు రాజు అనే వ్యక్తి గుట్కాను సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడి గుట్కా ప్యాకెట్ల విలువ 27,500 రూపాయలుఉంటుందని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుట్కాలు అమ్మితే వారిపైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది శ్రీనివాస్, తిరుపతి, రాజేష్, అక్సర్ పాల్గొన్నారు.