ముస్తాబాద్ : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు వాహనాలను పట్టుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ముస్తాబాద్ శివారులో మంగళవారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానంతో రెండు వాహనాలను నిలిపి తనిఖీ చేయగా పేదలకు పంపిణీ చేసే సుమారు 54 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సంచులు ఉన్నాయన్నారు. సిద్దిపేటకు చెందిన గంగల యాదగిరికి చెందిన వ్యాన్, ముస్తాబాద్ మండలం నామాపూర్కు చెందిన కడమంచి స్వామి డీసీఎంను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.