సిరిసిల్ల టౌన్ : గజ్వేల్ సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానపరిచాడని దళిత, గిరిజనులకు రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వై పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్ డిమాండ్చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రేవంత్రెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ సభలో దళిత, గిరిజనుల సాక్షిగా మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి రేవంత్రెడ్డి అవమానించాడని అన్నారు. మంత్రి కేటీఆర్ నిబద్ధత, పనితీరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుగా, రేవంత్రెడ్డి మాత్రం ఓటు నోటు కేసులో అడ్డంగా దొరికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారని విమర్శించారు.
కేటీఆర్కు సవాల్ విసురుతున్న రేవంత్రెడ్డికి కొడంగల్ ఎన్నికల ఫలితమే పునరావృతమవుతుందన్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా టీపీసీసీ అధ్యక్ష పదవి పొందిన రేవంత్రెడ్డి దళిత, గిరిజన దండోరా పేరుతో సభలు పెడుతున్నాడని, ఆ సభలకు ఎంతమంది దళిత, గిరిజనులు వస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. టీఆర్ఎస్వై నాయకుడు కత్తెర వరుణ్ మాట్లాడుతూ దళితుల అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న దళితబంధు పథకానికి ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తున్నదన్నారు. కార్యక్రమంలో మునీర్, మెట్ట రాజు, సుధీర్, కూర శ్రీధర్, గడ్డం కిరణ్, బూర తిరుపతి, అంజద్, ఇమ్రాన్, సిఖింధర్, అప్రోజ్, చాంద్, పవన్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.