ముస్తాబాద్లో టీఆర్ఎస్ నాయకుల హెచ్చరిక.. రాజీవ్చౌక్ వద్ద దిష్టిబొమ్మ దహనం
ముస్తాబాద్ : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తూ ప్రజల ఆదరణ పొందుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మతిభ్రమించి అసత్య ఆరోపణలు చేస్తున్నాడని ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు మండిపడ్డారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఇటీవల రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్రెడ్డి చరిత్ర తెలంగాణ రాష్ట్రంలోని అందరికీ తెలుసన్నారు. గురువారు ఎంపీపీ స్వగృహంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమావేశం అనంతరం పార్టీ నాయకులు రాజీవ్చౌక్ వరకు రేవంత్రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీగా వెళ్లి ప్రధాన రహదారిపై దహనం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చెర్పర్సన్ శీలం జానాబాయి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కలకొండ కిషన్రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు భూంపెల్లి సురేందర్రావు, ముస్తాబాద్ పట్టణాధ్యక్షుడు నర్సింహారెడ్డి, అంజన్రావు, యాది మల్లేశ్యాదవ్, బత్తుల అంజయ్య, మట్ట రాజిరెడ్డి, కొమ్ము బాలయ్య, సర్వర్పాషా, సాదుల్పాషా, అంజిరెడ్డి, నల్ల నర్సయ్య, ఏనుగు వేణు, మట్ట రాణి, దబ్బెడ రేణుక, మండల యువత అధ్యక్షుడు శీలంస్వామి, మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడు నవాజ్, మెంగని మనోహర్, గూడూరి భరత్, ముక్క మల్లయ్య, ముత్యాల దేవేందర్, అన్వర్, సర్పంచ్లు,. ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు పాల్గొన్నారు.