సిరిసిల్ల రూరల్, మార్చి 16: తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం విద్యార్థుల కోసం కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈసందర్భంగా 10 మంది ఉపాధ్యాయులు, 47 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ వచ్చిందని హెచ్ఎం బండి ఉపేందర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ నందగిరి నర్సయ్య, నేరెళ్ల పీహెచ్సీ వైద్యాధికారి సుప్రియ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.