సిరిసిల్ల టౌన్, మార్చి16: కరోనా వ్యాక్సిన్పై అపోహలు వద్దని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రంలో మంగళవారం ఆమె టీకా వేసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ కోసం అక్కడికి వచ్చిన వారితో ఆమె మాట్లాడారు. కరానా వైరస్ నివారణలో భాగంగా ప్రభుత్వం కొవిడ్-19 వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. అధైర్యపడకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ టీకా వేసుకునేలా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ కోనరావుపేట ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, డీఎంహెచ్వో సుమన్మోహన్రావు, తదితరులున్నారు.
జిల్లాలో కొవిడ్-19 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్వో సుమన్మోహన్రావు పేర్కొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీహెచ్సీల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరూ కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో రజిత, వైద్యులు శ్రీరాములు, అనిల్కుమార్, కపిలసాయి, తదితరులున్నారు.