రామగిరి, ఏప్రిల్ 15: నిరుపేద కుటుంబాలకు కొండంత భరోసా సీఎంఆర్ఎఫ్ పథకమని రామగిరి మండల ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య, కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యం కోసం సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న పలువురికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ చొరవతో ఆర్థిక సహాయం మంజూరైంది. కల్వచర్లకు చెందిన ఎం ఓదమ్మకు రూ. 27,500, సదయ్యకు రూ.7, 500, టీ కుమార్కు రూ.23వేలు, ఏ బక్కయ్యకు రూ.41,500, ఆర్ కుమారస్వామికి రూ.9వేలు, సుజిత్కుమార్కు రూ.36వేలు, సంపత్ రూ.24వేలు, రాకేశ్కు రూ.60వేలు, కనకయ్యకు రూ.16,500, రాజేశ్వరికి రూ.11,500, రాజేశ్వరికి రూ.32వేలు మంజూరయ్యాయి. జడ్పీ చైర్మన్ ఆదేశాల మేరకు గురువారం లబ్ధిదారులకు చెక్కులను అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శెంకేసి రవీందర్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ మేదరవేని కుమార్, మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి, నరేశ్ యాదవ్, మల్యాల మోహన్, ఏఎంసీ డైరెక్టర్ ఆసం తిరుపతి, కలిపాక సత్తయ్య, వార్డు సభ్యులు వేముల కనకయ్య, సెంటినరీకాలనీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్, సైండ్ల తిరుపతి, బొంకూరి పోశం, మల్లేశ్, కిష్టయ్య, రాజేశం, సాగర్, సంతు, ప్రభాకర్, రమేశ్, శేఖర్, సంపత్, పరశురాం, గోవిందు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
రుణ వసూళ్లపై మారటోరియం.. మోదీకి ఉద్ధవ్ విజ్ఞప్తి
RR vs DC: కెప్టెన్గా తొలి హాఫ్సెంచరీ బాదిన రిషబ్ పంత్