వేములవాడ, ఏప్రిల్20: పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కట్టడికి నిర్ణయం తీసుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మట్లాడారు. వైరస్ రోజురోజుకూ తీవ్రమవుతున్న తరుణంలో నియంత్రణ చర్యల కోసం బుధవారం అఖిలపక్ష నాయకులు, వైద్యాధికారులు వర్తక వ్యాపార సం ఘం అధ్యక్షులతో సమావేశం నిర్వహించి జాగ్రత్తలపై నిర్ణయం తీసుకుందామన్నారు. ఇప్పటికే పట్టణంలో వైరస్ విజృంభిస్తుండగా పలువురు మృతి చెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్యాం సుందర్రావు, కౌన్సిలర్లు మారం కుమార్, జోగం శంకర్, యాచమనేని శ్రీనివాసరావు, నరాల శేఖర్, రేగుల సంతోష్బాబు, గోలి మహేశ్, కోఆప్షన్ సభ్యుడు బాబున్, అధికారులు ఆర్ఐ మురళి, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ నర్సయ్య, నాయకు లు కొండ కనుకయ్య, హరీశ్, అన్నారం శ్రీనివాస్, సలీం తదితరులు పాల్గొన్నారు.