ధర్మపురి/ ధర్మారం, ఏప్రిల్ 20: మంత్రి కొప్పుల ఈశ్వర్ బర్త్డే వేడుకలను ధర్మపురి నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు నిరాడంబరంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కాగా, రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్కుమార్ ఇచ్చిన పిలుపు మేరకు.. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హైదరాబాద్లోని నివాసంలో మొక్క నాటారు. అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. మంత్రి ఈశ్వర్కు పలువురు ప్రముఖులు బర్త్డే విషెస్ తెలిపారు. మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, విద్యాసాగర్రావు, కోరుకంటి చందర్, సుంకె రవిశంకర్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ వసంత, టీఎస్వీసీసీ చైర్మన్ వాసుదేవరెడ్డి తదితరులు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.