రాజన్న సిరిసిల్ల : రెండో రోజు నేతన్నల నిరసనల దీక్షలు కొనసాగాయి. కేంద్ర ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ పై 5శాతం ఉన్న జీఎస్టీని 12శాతానికి పెంచడాన్ని నిరసిస్తూ సేవ్ టెక్స్ టైల్ పేరుతో జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రెండో రోజు నిరసన దీక్ష చేపట్టారు. వీరి ఆందోళనలకు సంఘీభావంగా మున్సిపల్ చైర్ పర్సన్ కళ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి దీక్షలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.
దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేత రంగమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.