రాజన్న సిరిసిల్ల :వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కార్యనిర్వహణ అధికారిగా కృష్ణ ప్రసాద్ నుంచి సోమవారం ఎల్. రమాదేవి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఏఈఓ, పర్యవేక్షకులు, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ప్రత్యేక పరిచయ కార్యక్రమం నిర్వహించారు.
బాధ్యతలు స్వీకరించిన ఈవో రమాదేవికి ఆలయం ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈవో రమాదేవి మాట్లాడుతూ..ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తమ సేవలు అందజేస్తామని తెలిపారు.