సిరిసిల్ల రూరల్, జనవరి 23 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ఐసీఎంఆర్ బృందం సర్వే నిర్వహించింది. చీర్ల వంచ పీహెచ్సీ పరిధిలో ఈ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు సర్వే చేసి, 80 మంది రక్త నమూనాలు సేకరించి, ఫీవర్, ఆరోగ్య స్థితిగతులను నమోదు చేశారు.
ఈ సర్వేను జిల్లా వైద్య అధికారి సుమన్ మోహన్ రావు పర్య వేక్షించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి బాబు, డిప్యూటి డైరెక్టర్ డాక్టర్ రాజేందర్రావు, సాయి బాబా, భవాని, ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది ఉన్నారు.