వేములవాడ: ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాస చివరి శుక్రవారం, పునర్వసు నక్షత్రం సందర్భంగా వేదపండితులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి అభిషేకాలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నది. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు.