కోనరావుపేట : పంట మార్పిడి చేయడంతోనే అధిక లాభాలను గడించొచ్చని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని సుద్దాల రైతువేదికలో యాసంగి పంటలపై రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పంటలు మార్పిడి చేయడంతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం భావిస్తున్నదని, అందుకు గాను రైతులు యాసంగిలో పంట మార్పిడి చేయడంతోపాటు ఎలాంటి పంటలు సాగు చేస్తే బాగుంటుందనినే విషయాలపై చర్చించేందుకు వ్యవసాయాధికారులతో అవగాహన సదస్సులను ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యంగా చిరుధాన్యాలతోపాటు ఆయిల్పామ్ తోటలను సాగు చేయాలని, మంత్రి కేటీఆర్ జిల్లాకు ఆయిల్ పామ్ పరిశ్రమను తీసుకొస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్యగౌడ్, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ గోగు ప్రతాపరెడ్డి, సర్పంచ్లు ఉప్పుల దేవలక్ష్మి, జిన్న అనిల్, కాదాసు సంతోష్, ఎంపీటీసీ కాశవేణి మమత, సింగిల్ విండో వైస్ చైర్మన్ మహేశ్, ఎవో వేంకట్రావమ్మ, ఉపసర్పంచ్ నాగరాజు, ఏఈవోలు నరేశ్, పద్మ,శాలిని, జాహెద్, శివ, హెమాజీ పాల్గొన్నారు.