సిరిసిల్ల రూరల్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్లలోని బీవై నగర్లో మరమగ్గాల ఖార్ఖానాలో విద్యుత్ షాక్ గురై జక్కని నారాయణ (55) అనే కార్మికుడు మృతి చెందాడు. స్థానిక బీవై నగర్లోని హనుమండ్ల రాంనారాయణ పవర్ లూమ్ యజమాని ఖార్ఖానాలో నారాయణ పనిచేస్తున్నాడు.
కాగా, శుక్రవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. నారాయణకు భార్య సునీత ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.