సిరిసిల్ల: జిల్లాలోని వేములవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర కలర్ ల్యాబ్లో శుక్రవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్కనే ఉన్న షాపులకు విస్తరించాయి. దీంతో వ్యాపార సామాగ్రి అంతా కాలి బూడిదయ్యింది. అయితే మంటలను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ.25 లక్షల ఆస్తినష్టం సంభవించిందిందని వ్యాపారులు వాపోతున్నారు.