రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య
సిరిసిల్ల రూరల్: రాబోయే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య రైతులకు విజ్ఞప్తి చేశారు. శనివారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలోని జిల్లా రైతువేదికలో యాసంగి 2021-22 పంట మార్పిడిపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో దొడ్డు రకం ధాన్యం నిల్వలు భారీగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడ దొడ్డు రకం కొనమని చెప్పడంతో రైతులు పంట మార్పిడి చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, శనగ, పెసర, నువ్వులు, ఉద్యానవన పంటలతోపాటు ఆయిల్పామ్ తోటలను సాగు చేయాలని సూచించారు. మంత్రికేటీఆర్ ప్రత్యేక చొరవతో ఆయిల్పామ్ పరిశ్రమ జిల్లాలోనే ఏర్పాటు కానుందన్నారు. మంత్రి కేటీఆర్ సూచనతో ఖమ్మంలో సాగు చేస్తున్న ఆయిల్పామ్ పంటల సాగును క్షేత్ర స్థాయిలో సందర్శనకు రైతులు తరలిరావాలని ,త్వరలోనే ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్లేందుకు మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆసక్తి గల రైతులు తమ పేర్లను వ్యవసాయ శాఖ అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని కోరారు.
అంతకుముందు జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్రెడ్డి మాట్లాడుతూ రైతులు పంటల మార్పిడిపై దృష్టిసారించి, ఆరుతడి పంటలు, ఉద్యానవన పంటలు, ఆయిల్పామ్ తోటలను సాగుచేయాలన్నారు. అనంతరం సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మాట్లాడుతూ రైతులు లాభదాయకమైన పంటలు వేసుకోవాలని కోరారు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ అగ్గిరాములు మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్నారు.
ఈ సదస్సులో ఏవో తిరుపతి, కౌన్సిలర్లు పోచవేణి సత్య, పాతూరి రాజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బూర నరేశ్, రైతు సమితి సభ్యులు పోచవేణి గంగయ్యయాదవ్, పోచవేణి ఏల్లయ్యయాదవ్, బూర తిరుపతి, వీరగోని శ్రీనివాస్, అబ్బగోని శ్రీనివాస్, నర్మేట ప్రభుదాస్, మాజీ ఎంపీటీసీ బుర మల్లికార్జున్, గుగ్గిల్ల అజయ్గౌడ్, కాంగ్రెస్ నేత ఆకుకూరి బాలరాజుతోపాటు రైతు బంధు సమితి సభ్యులు, రైతులు, ఏఈవోలు ఉన్నారు.