రాజన్న సిరిసిల్ల : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య
చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్లో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన లోకోరవేని హన్మయ్య (60) అనే రైతు అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. హన్మయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.