ముస్తాబాద్ : సీఎం కేసీఆర్ దళితుల పక్షపాతి అని, దళితుల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు కొమ్ము బాలయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహం ఎదుట దళితులు ఆర్థికంగా ఎదగాలని దళితబంధు, మద్యం షాపుల్లో దళితులకు రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షిస్తూ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు.