వేములవాడ : వేములవాడ శ్రీ పార్వతీ రారాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం భక్తులతో రద్దీ గా కనిపించింది. వేకువ జాముననే భక్తులు స్వామివారి కోడె మొక్కు చెల్లించుకున్నారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో చండీహోమాలు, కుంకుమ పూజలు,కళ్యాణాల మొక్కులు నిర్వహించారు. రాజన్నను దాదాపు 12 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు.