కోనరావుపేట: మండలంలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన చిన్నారి డెంగీ జ్వరంతో బాధపడు తూ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మ్యాకల శంకర్, జ్యోత్స్య దంపతులకు చాలా రోజుల తర్వాత శ్రేష్ఠ (18 నెలలు) జన్మించింది. శంకర్ గత పదేండ్లుగా ఉపాధి కోసం గల్ఫ్ దేశం వెళ్తున్నాడు. జ్యోత్స్య ఇంటి వద్దనే ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ చిన్నారిని చూసుకుంటున్నది. ఇటీవల శ్రేష్ఠ జ్వరంతో బాధపడటంతో తల్లి కరీంనగర్లోని ఓ ప్రైవే ట్ దవాఖానకు చికిత్స కోసం తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. వైద్యుల సూచన మేరకు చిన్నారిని హైదరాబాద్లోని ఓ దవాఖానకు తరలించగా , అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.