సిరిసిల్ల టౌన్, జూలై 25: పద్మశాలీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఆదివారం పద్మపీఠం ఎడిటర్ కొక్కుల భాస్కర్ ఆధ్వర్యంలో అఖిల భారత పద్మశాలీ పురోహిత సంఘం నూత న కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా చైర్పర్సన్ జిందం కళ, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని సూచించారు. హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. బతుకమ్మ చీరెలు, ఆర్వీఎం, రంజాన్, క్రిస్మస్ కానుకల వస్ర్తాల తయారీ ఆర్డర్లు అందించి నేతన్నలకు ఆర్థిక చేయూత అందిస్తున్నదన్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలో పద్మశాలీ భవనం ఏర్పాటుకు ఐదెకరాల స్థలంతోపాటు 5కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని కొనియాడారు. అనంతరం నూతన అధ్యక్షుడు జిల్లా వేణుగోపాల్తోపాటు కార్యవర్గ సభ్యులను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఏనుగుల అంజమ్మ, ఏనుగుల ఎల్లయ్య, పద్మశాలీ పురోహిత సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.