పెద్దపల్లి జంక్షన్, జూలై 22: తెలంగాణ సర్కారు గొల్ల కుర్మల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని కాల్వశ్రీరాంపూర్ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్ తెలిపారు. రెండో విడు త గొర్రెల పంపిణీకి సంబంధించిన యూనిట్ ధరను పెంచడాన్ని హర్షిస్తూ గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం, జిల్లా యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని యాదవ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, ఆర్థ్ధిక శాఖ మంత్రి హరీశ్రావు, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రెండో విడుత గొర్రెల పంపిణీ యూనిట్ ధర రూ. 1, 25,000 నుంచి రూ. 1,75,000కు పెంచిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ గొర్రెల కాపరులు సంక్షేమం సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్యయాదవ్, జంగ మహేందర్ యాదవ్ తదితరులున్నారు.
ఓదెల, జూలై 22: గొర్రెల యూనిట్ కొనుగోలు విలువను సీఎం కేసీఆర్ పెంచడం హర్షం వ్యక్తం చేస్తూ బాయమ్మపల్లెలో యాదవులు కేసీఆర్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. గతంలో గొర్రెల యూనిట్ కొనుగోలు విలువ రూ.1.25 లక్షలు ఉండగా, రెండో విడత పంపిణీలో ఆ ధర సరిపోదని మంత్రులు శ్రీనివాస్యాదవ్, హరీశ్రావు విజ్ఞప్తి మేరకు సీఎం స్పందించి రూ.1.75 లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. రూ.6 వేల కోట్లతో రెండో విడుత గొర్రెల పంపిణీకి ఆమోదం తెలుపడాన్ని స్వాగతించారు. ఈ సందర్భంగా యాదవ సంఘ మండలాధ్యక్షుడు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ కావటి రాజుయాదవ్ మాట్లాడుతూ,యాదవుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ తెల్సూరి కొమురయ్యయాదవ్, నాయకులు కు క్కల రాజు, మద్దూరి కుమారస్వామి, మల్లయ్య, కొమురయ్య, మద్దూరి రాజు, రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.