న్యూఢిల్లీ: కొవిడ్-19 చికిత్సలో కీలక పాత్ర పోషిస్తున్న పల్స్ ఆక్సీమీటర్ల ధరలకు కళ్లెంవేయడానికి కేంద్రప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పల్స్ ఆక్సీమీటర్, గ్లూకోమీటర్, బీపీ మానిటర్, నెబ్యులైజర్, డిజిటల్ థర్మోమీటర్లపై ప్రస్తుతం 3%-709%గా ఉన్న డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ను (ప్రొడక్టుపై లాభాన్ని) 70 శాతానికి పరిమితం చేస్తూ నిర్ణయించింది. ఈ మేరకు ధరల హేతుబద్దీకరణలో మార్పులు చేసింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి.