నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 67 వేల క్యూసెక్కుల వరద గోదావరి నదిలోకి ప్రవహిస్తుంది. దీనికి తోడుగా ఆదివారం కురిసిన భారీ వర్షాలకు గోదావరికి అదనంగా 10వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 37.37 టీఎంసీల నీల్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.