న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ మొత్తానికి దిగి వచ్చింది. ఇన్నాళ్లకు వినయ్ ప్రకాశ్ను ఇండియాలో రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్గా నియమించింది. ఇండియాలో కొత్త ఐటీ నిబంధనలను పాటించని ట్విటర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ గ్రీవియన్స్ ఆఫీసర్తోపాటు చీఫ్ కాంప్లయెన్స్ ఆఫసీర్, నోడల్ ఆఫీసర్ను కూడా నియమించాల్సి ఉంది. మిగతా అన్ని సోషల్ మీడియా సంస్థలు కొత్త ఐటీ నిబంధనలకు అంగీకరించినా.. ట్విటర్ మాత్రం తనకు ఇంకా సమయం కావాలని అడుగుతూ వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ సంస్థలకు ఇచ్చే చట్టపరమైన రక్షణలను కూడా ఎత్తేసింది. దీనిపై కోర్టుకెళ్లినా.. అక్కడా ట్విటర్కు చుక్కెదురైంది. గ్రీవియన్స్ ఆఫీసర్ను నియమించడానికి తనకు 8 వారాల సమయం కావాలని గురువారం ఢిల్లీ హైకోర్టును కోరిన ట్విటర్.. నాలుగు రోజుల్లోనే నియమించడం గమనార్హం.