భువనగిరి అర్బన్, జూలై 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిలో ముందంజలో ఉండాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని తుక్కాపురం గ్రామంలో నిర్మించిన డంపింగ్ యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతివనం, సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలను ప్రా రంభించారు. అనంతరం పల్లెప్రగతిలో భాగంగా వార్డులను కలియతిరిగి అమ్మ నేను వచ్చింది ఓట్లకోసం కాదని, మీ సమస్యలు పరిష్కరించేందుకుని.. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరా రు. ఈ సందర్భంగా స్థానికులను మీ వార్డు, మీ ఇం టి ఆవరణలోని సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు సక్రమంగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన పను లు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకుని వారు చెప్పిన మాటలువిని సంతృప్తి చెందా రు. ఈ సందర్భం గ్రామంలో మొక్కను నాటా రు.
వార్డుల్లో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలను చేపట్టాలని పలువురు స్థానికులు విన్నవించగా.. అక్కడే ఉన్న అధికారులతో కొలతలు తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఉన్న భూమిని గ్రామానికి చెం దేలా చూడాలని, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్కు సూచించారు. మర్రిగూడెంకాలనీలో కలియతిరిగి స్థానికుల కోరిక మేరకు వా టర్ ట్యాంకు, పోచమ్మగుడి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని, పల్లెప్రగతిలో గుర్తించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రా మంలో సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలించి సేంద్రియ ఎరువును తయారు చేసుకోవాలని సూచించారు. హరితహారంలో మొక్కలు నాటడం, డ్రైనేజీల్లో పూడికలు, వీధుల వెంట పిచ్చి మొక్క లు తొలగించడం, శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లు, పాతబావులు పూడ్చివేయడం వంటి పనులను పూర్తి చేయాలన్నారు.
పల్లెప్రకృతి వనాల్లో నా టిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు శాలువాతో ఘనం గా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్రెడ్డి, జడ్పీటీసీ బీరుమల్లయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ కంచి మల్లయ్య, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, చందుపట్ల మాజీ సింగిల్విండో చైర్మన్ బల్గూరి మధుసూదన్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీలం ఓంప్రకాశ్గౌడ్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్గౌడ్, నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, కోమటిరెడ్డి మోహన్రెడ్డి, జెక్క రాఘవేందర్రెడ్డి, జీలుగు పవన్సతీశ్, ఈర్ల కృష్ణ, నల్లమాస సత్య నారాయణ, మల్లికార్జున్, వీరేశ్యాదవ్, మహేశ్, చిలువేరు మధు, ప్రవీణ్కుమార్, సర్పంచ్ నోముల పద్మామహేందర్రెడ్డి, ఎంపీటీసీ రాసాల మల్లేశ్, ఉప సర్పంచ్ సతీశ్ పాల్గొన్నారు.