ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు
గజ్వేల్, జూన్ 30: పల్లెప్రగతితో రాష్ట్రంలోని 98 శాతం గ్రామాలు అభివృద్ధి చెందాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధ్యక్షతన పల్లె, పట్టణప్రగతి సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మండలానికో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని 10 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని, 10 రోజుల్లో పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పల్లెప్రగతి పూర్తయ్యేలోపు గ్రామాల్లో డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలను పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, రసమయి, రఘునందన్రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.