బాలీవుడ్ లో భారీ పారితోషికం అందుకునే నటులలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ కూడా ఉంటాడు. ఒక్కో సినిమాకు కనీసం 5 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటాడు ఈయన. అలాంటి ఈనటుడు ఒక్క రూపాయి పారితోషికం అందుకోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఒక్కోసారి కెరీర్ లో కథలు నచ్చి సినిమాలు చేస్తుంటారు నటులు. అలాంటి కథ తమ దగ్గరికి వచ్చినపుడు ఒక్క రూపాయి కాదు కదా.. ఫ్రీగా చేయాలనుకుంటారు. అలాంటి కథే ఒకటి నవాజుద్దీన్ దగ్గరికి మూడేళ్ళ కింద వచ్చింది. ఆ సినిమా పేరు మాంటో. ప్రముఖ ఉర్ధూ రచయిత సాదత్ హాసన్ మాంటో జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాను నందితా దాస్ తెరకెక్కించింది. మాంటో సినిమాలో నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో నటించాడు.
అలాగే ఇందులో రిషి కపూర్, రన్వీర్ షోరే, జావేద్ అక్తర్, పరేష్ రావల్, దివ్యా దత్త లాంటి స్టార్స్ కూడా నటించారు. ఇంతమంది సినిమాలో ఉన్నారంటే కచ్చితంగా బడ్జెట్ కూడా భారీగానే అయ్యుంటుంది అనుకుంటారంతా. కానీ ఈ సినిమా కోసం అందరూ ఫ్రీగానే నటించారు. ఒక్కరు కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. కథ నచ్చి.. అలాగే మాంటోకు గౌరవం ఇచ్చి అంతా ఉచితంగానే నటించారు. ఈ విషయం అప్పట్లో ఈ దర్శకురాలు నందితా దాస్ స్వయంగా మీడియాకు చెప్పింది. డబ్బు కోసం కాకుండా స్క్రిప్ట్ కు విలువిచ్చి వాళ్లంతా తన సినిమాలో ఫ్రీగా నటించారని తెలిపింది. అయితే ఈ చిత్రంలో హీరోగా నటించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ ఎంత తీసుకున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఇందులో నటించడానికి అంతా డబ్బులు తీసుకోకపోయినా.. నవాజుద్ధీన్ మాత్రం తీసుకున్నాడు. ఈయన తీసుకున్న పారితోషికం ఒక్క రూపాయి. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఈ విషయాన్ని నవాజుద్దీన్ స్వయంగా చెప్పాడు. మాంటో సినిమాకు తాను రూపాయి మాత్రమే తీసుకున్నట్లు తెలిపాడు. ఈ సినిమాతో తన ఆలోచనలను, ఆశయాలను వ్యక్తీకరించాలనుకున్నాడు నవాజుద్ధీన్. అందుకే ఈ సినిమా కోసం రూపాయి తీసుకున్నట్లు చెప్పాడు సిద్ధిఖీ.
ఇవి కూడా చదవండి..
కరోనాకు బలైన మరో ప్రముఖ నటుడు
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!